Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్‌తో పాటు -ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

New Update
heavy rains

Heavy rains

తెలంగాణ(Telangana) కు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్‌తో పాటు -ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీని వల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  వర్షంతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

మంగళవారం మరో అల్పపీడనం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్‌-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం  ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేశారు.

వచ్చే మూడు రోజుల్లో  తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ వెల్లడించింది.  అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది

ఈ నెలలోనూ వర్షాలే.. వర్షాలు

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) అంచనా వేసింది. సాధారణంగా ఏటా సెప్టెంబర్‌లో 167.9మి.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అయితే  ఈసారి మాత్రం ఈ  నెలలో సాధారణం కంటే 109% ఎకువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్రా వెల్లడించారు. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 268.1మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5% ఎకువ. తెలంగాణలో ఆగస్టు నెలలో 378.5మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది 75% అధికమని, జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 720.6మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 26% అధికం అని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు 250.6మి.మీ వర్షపాతం కురిసింది. సాధారణం కంటే ఇది 31% ఎకువ అని వెల్లడించారు. తాజాగా అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సూచనలను అనుసరించాలని సూచించారు.

Also Read: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!

Advertisment
తాజా కథనాలు