Tv Offers: వర్త్ వర్మ వర్త్.. కొత్త 4K స్మార్ట్‌టీవీపై కిర్రాక్ ఆఫర్లు - అస్సలు వదలొద్దు!

థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ QLED టీవీ విడుదలైంది. ఇది 50,55,65 ఇంచులతో రిలీజైంది. 50QAI1015 మోడల్ రూ.26,999, 55QAI1025 మోడల్ రూ. 30,999, 65QAI1035 మోడల్ రూ. 43,999గా ఉంది. మే 2 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది. రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.

New Update
tv offers flipkart

tv offers

ప్రముఖ టీవీల తయారీ సంస్థ థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీ ‘థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ QLED’ టీవీని విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ మూడు మోడళ్లలో వచ్చింది. అందులో 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాల QLED 4k డిస్ప్లేలలు ఉన్నాయి. థామ్సన్ QLED టీవీ మెటాలిక్‌తో కూడిన బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ఈ థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ QLED TV ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

Thomson Phoenix Series QLED TV Price

Thomson Phoenix Series QLED TV సిరీస్ ధర విషయానికొస్తే.. QLED TV 50QAI1015 మోడల్ ధర రూ. 26,999గా ఉంది. అదే సమయంలో 55QAI1025 మోడల్ ధర రూ. 30,999 కాగా.. 65QAI1035 మోడల్ ధర రూ. 43,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీల సేల్ మే 2, 2025 నుండి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. వీటిపై బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. యాక్సస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్లపై రూ.1000 తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు రూ.5,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 

Also Read: 'పాకిస్తాన్‌ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!

Thomson Phoenix Series QLED TV Features

థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ టీవీలు QLED 4k డిస్ప్లేలతో వస్తాయి. ఇవి HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్, ట్రూసరౌండ్‌తో డాల్బీ అట్మోస్‌కు మద్దతును కలిగి ఉంటాయి. ఈ థామ్సన్ QLED టీవీ మెటాలిక్‌తో కూడిన బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ టీవీలు 2GB RAM తో పాటు 16GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. 

Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!

అదే సమయంలో మాలి-G312 GPU తో ARM కార్టెక్స్ A554 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటాయి. సౌండ్ అవుట్‌పుట్ విషయానికొస్తే.. 50 అంగుళాల టీవీలో 50 వాట్ల 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే 55, 65 అంగుళాల టీవీలలో 60 వాట్ల 4 స్పీకర్లు ఉంటాయి. స్మార్ట్ AI ఫీచర్లలో AI PQ చిప్‌సెట్, AI స్మూత్ మోషన్ (60Hz), అనేక పిక్చర్, సౌండ్ మోడ్‌లు ఉన్నాయి. 

Also Read:దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

ఈ ఫీనిక్స్ సిరీస్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, ఆపిల్ టీవీ, వూట్, జీ5, సోనీ ఎల్ఐవి, గూగుల్ ప్లే స్టోర్‌తో సహా 10,000 కి పైగా యాప్‌లు, గేమ్‌లను సపోర్ట్ చేస్తాయి. కనెక్టవిటీలో.. డ్యూయల్-బ్యాండ్ 2.4 + 5 GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, 3 HDMI పోర్ట్‌లు (ARC, CEC), 2 USB పోర్ట్‌లు, Google TV, Chromecast, AirPlay వంటివి ఉన్నాయి. 

tech-news | telugu tech news | tech-news-telugu | tv offers | smart-tv-offer | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴LIVE BREAKINGS: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
Live News Updates

Live News Updates

Jr.NTR: తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు

బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం. 

యంగ్ హీరో జూనియర్ నందమూరి తారక రామారావు తన నటన, డ్యాన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చేలా నిలిచారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం. 

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

Jr.NTR 42nd Birthday Special Story

NTR child

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా 1983లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ఆ తర్వాత బాల రామాయణంలో నటించారు. ఇక హీరోగా 2001లో నిన్ను చూడాలని మూవీతో డెబ్యూగా మారాడు. ఆ తర్వాత వరుసగా స్టూడెంట్ నెం1, సింహ్రాది వంటి సినిమాలతో హిట్ కొట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.

Also Read :  జరిమానా వేసినా బుద్ధి మారలే.. దిగ్వేశ్‌తో గొడవపై అభిషేక్‌ షాకింగ్ కామెంట్స్!

NTR First Movie

ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు చెప్పుకోదగ్గ హిట్‌లు అయితే పడలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయాల కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. ఎన్టీఆర్‌కు మళ్లీ టెంపర్ మూవీతో హిట్ పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేతా వీర రాఘవ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. 

Also Read :  12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్

NTR Temper Movie

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నేడు టీజర్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read :  సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!

War 2

breaking news in telugu | today-news-in-telugu | telugu-news | latest-telugu-news | Live Breakings

  • May 20, 2025 11:03 IST

    ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

    నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

    RBI



  • May 20, 2025 11:03 IST

    భలే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

    ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.

    Gold
    Gold

     



  • May 20, 2025 09:11 IST

    సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!

    నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ను దారుణంగా చంపేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. సరదాగా ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లగా అక్కడ నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ మలద్వారంలో వాటర్ పైపు పెట్టి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Haryana friends murder
    Haryana friends murder

     



  • May 20, 2025 09:10 IST

    పాక్‌ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్‌!

    పహల్గాం ఘటనపై భయంకర నిజాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేసేందుకు ఇండియాలో కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు. 

    pakistan espionage network
    pakistan espionage network Photograph: (pakistan espionage network)

     



  • May 20, 2025 09:10 IST

    తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు మాయం!

    తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్‌లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్‌ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    tg rajbhavan
    tg rajbhavan Photograph: (tg rajbhavan)

     



  • May 20, 2025 09:09 IST

    రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్

    రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత  ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు. 

    usa
    Russia-Ukraine War

     



  • May 20, 2025 07:39 IST

    ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!

    తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

    murder nzb
    murder nzb Photograph: (murder nzb)

     



  • May 20, 2025 07:37 IST

    విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే

    భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 

    vande bharat



  • May 20, 2025 07:37 IST

    బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు

    బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు పడతాయి.

    rains Telangana



  • May 20, 2025 07:36 IST

    SRH VS LSG: తాను పోయింది... లక్నోను తీసుకెళ్ళిపోయింది

    అదేదో సామెత చెప్పినట్టు...ఎస్ఆర్హెచ్ తాను వెళ్ళిపోయింది ఎలానో వెళ్ళిపోక తనతో పాటూ లక్నోను కూడా ప్లే ఆఫ్స్ కు దూరం చేసింది. అసలు మ్యాచ్ లన్నింటిలోనూ ఓడిపోయిన హైదరాబాద్ నిన్న జరిగిన దానిలో మాత్రం గెలిచి...లక్నోను ఇంటికి పంపించేసింది.

    ipl
    SRH VS LSG

     



  • May 20, 2025 07:35 IST

    పొడవకుండా రక్త పరీక్ష... నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం

    వైద్యపరంగా నీలోఫర్ ఆసుప్రతి మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి సూదితో పొడవకుండా రక్త పరీక్షను నిర్వహించింది. ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌ సాధనాన్ని క్విక్‌ వైటల్స్‌ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

    hyd
    AI based blood test mission

     



  • May 20, 2025 07:34 IST

    తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

    వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.



Advertisment
Advertisment
Advertisment