Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి.
నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.