బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.