వైసీపీ నేతను ఎస్సై ముందే చెప్పుతో కొట్టిన టీడీపీ మహిళా నేత

వైజాగ్‌లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.

New Update

విశాఖపట్నంలో వైసీపీ నేతలపై టీడీపీ మహిళానేత దాడి చేసింది. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నరేంద్ర అనే వైసీపీ నేత ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. వారి దగ్గర నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ నరేంద్రపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో పోలీసులు నరేంద్రను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో అనంత లక్ష్మి చెప్పుతో దాడి చేసింది. సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు