రానున్న 24 గంటల్లో భారీ వర్షం ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్ |Dhana Toofan Effect | RTV
విశాఖపట్నంలోని స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జగన్ శారదా పీఠానికి ఇచ్చిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని తాజాగా విశాఖ ఎయిర్పోర్టు పోలీసులకు మరో బాధితుడు కంప్లైంట్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ పేర్కొన్నాడు.
గౌహతి ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బెంగళూరు నుంచి గౌహతికి ఈ రైలు వెళ్తుండగా.. సింహాచలం వచ్చే సరికి ఎస్-7 భోగిలో పొగలు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సింహాచలంలో ట్రైన్ను నిలిపివేశారు.
ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు.
విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు.
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. ఈ ప్రమాదంలో మరి కొంద మంది గల్లంతైనట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు.