🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారినుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు.
పాక్కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ హైదరాబాద్లో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
హైదరాబాద్లోని చార్మినార్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.