PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. వాళ్ళు ఇస్తే తీసుకోమని నిరాకరించారు. ఎందుకో తెలుసా..
మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది.
అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టోర్నీలో మొదటి నుంచి బాగా పరుగులు చేస్తున్న అభిషేక్ శర్మ మొదటి వికెట్ ను కోల్పోగా..కెప్టెన్ స్కై కూడా ఒక్క పరుగుకే తన వికెట్ ను కోల్పోయాడు.
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.
పాకిస్తాన్ ఓపెన్ల జోరు చూస్తే భారీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ పది ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను చీల్చి చెండాడారు. వరుసగా వికెట్లు తీస్తూ తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. దీంతో భారత్ టార్గెట్ 147 ఇచ్చారు.
పన్నెండో ఓవర్ లో భారత బౌలర్లు మరో వికెట్ పడగొట్టారు. కులదీప్ బౌలింగ్ లో సైమ్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో హరీస్ డక్ అవుట్ గా వెనుదిరిగాడు.ప్రస్తుతం పాక్ 114 పరుగులు చేసింది.
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.