భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్లోని మథురలో ముకుట్ ముఖారవింద్ అనే ఆలయంలో దినేష్ చంద్ అనే పూజారి రూ.కోటి 9 లక్షలు దొంగతనం చేసి పరారయ్యాడు. ఆలయ మేనేజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కెనడాలోని ఎడ్మంటన్లో హిందూ దేవాలయం మీద కొందరు దుండగులు మరోసారి దాడి చేశారు. దేవాలయ గోడలపై రంగులతో భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ ఘటనను కెనడా విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు.
కాణిపాకంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు, ఆలయ సిబ్బంది చేపట్టారు.బంగారాన్ని వెలకట్టేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రైజర్ ప్రకాష్ ఆలయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో...
మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య.. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలని విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టించింది.