Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు శివుడిని ఇలా పూజిస్తే.. పుణ్యం మీ సొంతం

మహా శివరాత్రి నాడు ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. వీలైతే రుద్రాభిషేకం లేకపోతే పంచామృతాలతో అయినా అభిషేకం చేయాలి. ముత్యాలు లేదా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
Maha Sivarathri

Maha Sivarathri Photograph: (Maha Sivarathri )

Mahashivratri 2025: మహా శివరాత్రి పండుగ వచ్చేస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు భక్తితో శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజిస్తే ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ప్రదోష సమయంలో అభిషేకం చేస్తే..

మహా శివరాత్రి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఈ శివరాత్రి రోజున  శివుడికి రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది. రుద్రాభిషేకం చేయడం కుదరని వాళ్లు కనీసం నీళ్లతో అయినా శివునికి అభిషేకం చేయాలి. ఇది ఉదయం లేదా ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది. అలాగే శివునికి ఎనిమిది నమస్కారాలు చేసి, పన్నెండు రకాల పువ్వులతో పూజించాలి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఉంటే ముత్యాలతో శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న వివాదాలు అన్ని కూడా క్లియర్ అయ్యి సంతోషంగా ఉంటారు. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేయించడంతో పాటు బిల్వ పత్రాలతో కూడా పూజించాలి. ఇలా పూజిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన పండితులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు