నూతన పోప్ గా రాబర్ట్ ప్రవోస్ట్
రాబర్ట్ ప్రవోస్ట్ నూతన పోప్ గా ఎన్నికయ్యారు. సంప్రదాయం ప్రకారం 133 మంది కార్డినల్ లు సీక్రెట్ గా సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన వ్యక్తి పాప్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
రాబర్ట్ ప్రవోస్ట్ నూతన పోప్ గా ఎన్నికయ్యారు. సంప్రదాయం ప్రకారం 133 మంది కార్డినల్ లు సీక్రెట్ గా సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన వ్యక్తి పాప్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ నుంచి రక్షించాలంటూ ఆ ఎంపీ వేడుకున్నారు. అల్లాయే కాపాడాలంటూ ప్రార్థించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ నోటరీని బెంగళూరులో తయారు చేయించారు. ఆ సమయంలో జగన్ కూడా బెంగళూరులో ఉండడంతో అధికారులకు అనుమానం వ్యక్తం అవుతోంది.
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో సైతం మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైల్వే అధికారులు వివరించారు.
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.