TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు!
రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.