Telangana: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు
రేవంత్ సర్కార్ సోమవారం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనుంది.