Telangana Cabinet: కేబినెట్ మీటింగ్.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం..

తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

New Update
Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలను సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లతో సహా మరికొన్ని అంశాలపై చర్చించారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ!

మెట్రో రైల్‌ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో సహా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్‌ బోర్డు, HMDA యాక్ట్‌లో మార్పులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూభారతి చట్టం అమలు, మైనింగ్ యాక్ట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాలు కేబినెట్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు వెల్లడించనున్నారు.    

Also Read: కోమాలోకి వెళ్లాడంటూ డాక్టర్లు డబ్బు డ్రామా.. ICU నుంచి నడుచుకుంటూ బయటకొచ్చిన పేషెంట్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు