/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
Telangana Assembly approves BC Bill and SC classification
Telangana: తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టగా ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును కేంద్రానికి పంపించనుండగా ఆమోదం కోసం పార్టీలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
ఇదో చారిత్రాత్మక ముందడుగు..
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇదో చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రం చేయని కులగణనను తాము చేపట్టి పక్కా లెక్కలతో సభ ముందుకు బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
బీసీ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందన్నారు. చట్టం వచ్చే వరకు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడే ఆ వర్గాలు నిజంగా సంతోషిస్తాయన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలన్నారు. అయితే దీనిని రాజకీయ ఎత్తుగడగా చూడొద్దని ప్రభుత్వానికి సూచించారు. తమిళనాడు స్ఫూర్తితో అన్ని పార్టీలను ముందుండి నడిపించాలని చెప్పారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షంలో 100 మంది ఎంపీలు ఉన్నారని, దీనిపై రాహుల్ గాంధీ గట్టిగా పూనుకంటే బిల్లు మద్దతు పొందుతుందని సూచించారు.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?