Pastor Praveen Friend Shocking Facts Revealed🔴LIVE : ప్రవీణ్ భార్యకు ఫోన్చేసి | Jessica Pagadala
తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్కు ఒకే స్థానం దక్కనుంది. కానీ రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తోంది. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు బీసీల నుంచి మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్ లలో ఒకరికి.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి RS ప్రవీణ్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. 2023 జనవరిలో తన ఫోన్ హాక్ చేసేందుకు బీఆర్ఎస్ లేదా బీజేపీ ప్రయత్నించిందని ప్రవీణ్ చెప్పడం సంచలనం రేపింది. దీనిపై విచారణ జరగకపోగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఫుడ్ పాయిజన్ కుట్ర కోసం మాఫియాను నడిపించాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ ఖండించాడు. చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరాడు. ఏ విచారణకైనా తాను సిద్ధమేని చెప్పాడు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్నారు. దీనిపై దుష్ప్రచారపు ఘటనల్లోనూ ఆయన పాత్ర ఉందని, ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తుందని తెలిపారు.
గ్రూప్-3 పరీక్షలో తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలతో కూడిన ప్రశ్నలను అడగడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రశ్నాపత్రాల్లోనే ఇలాంటి పదాలు ఉంటే సామాజిక న్యాయం ఎలా సాధ్యమంటూ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు.