Telangana: దళిత పిల్లలను చీట్ చేసిన RS ప్రవీణ్.. కాంగ్రెస్ నేత సామ సంచలన ఆరోపణలు!

పీసీసీ అధికార ప్రతినిధి సామాR రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ దళిత పిల్లలను మోసం చేశారంటూ విమర్శలు చేశారు. దళిత పిల్లలకు దక్కాల్సిన నిధులు మళ్లించారంటూ మండిపడ్డారు.

New Update
Congress Leader Sama Rammohan Reddy

Congress Leader Sama Rammohan Reddy

పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ దళిత పిల్లలను మోసం చేశారంటూ విమర్శలు చేశారు. '' మాజీ ఐపీఎస్ ఆర్‌ ఎస్ ప్రవీణ్.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి మళ్ళించారు. అంబేద్కర్ పేరుచెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు.  

Also Read: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు

కేంద్రం CAG నివేదికలో పొందుపర్చిన అంశాలే బయట పెడుతున్నాం. కోడింగ్ విధానంపై ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చు చేశారు. 240 మంది పిల్లలకు కోడింగ్ చేస్తే 4 కోట్లు అవుతాయా?. మూడు సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తా అని చెప్పి.. రెండు సంస్థల అనుమతి తీసుకున్నారు. ఈ - టెండర్ ప్రక్రియ కూడా చేయలేదు. అంబేద్కర్ పేరు చెప్పి దళిత విద్యార్థులను లూటీ చేశారు. 

Also Read: ఆర్మీ సమాచారం లీక్‌.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

ఐఐటీ, జేఈఈ ఆన్లైన్ కోర్స్ కి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. దీనికి టెండర్ లేదు. ఆర్థిక శాఖ అనుమతి కూడా లేదు. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలి. ఇప్పుడు లక్ష 20 వేల మందికి ప్రభుత్వం ఉచితంగానే కోడింగ్‌కి శిక్షణ ఇస్తోంది. సమ్మర్ క్యాంప్‌ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారు. యూనిఫాం, దుప్పట్లు కూడా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వదిలి పెట్టలేదు. 11 ఏళ్లలో ఎస్సీ గురుకులాల్లో 100 శాతం సీట్ల భర్తీ లేదు. కానీ ఇప్పుడు సీట్లు అన్నీ భర్తీ అయ్యాయని'' సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. 

Also Read: ఏం మనిషివిరా..  తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం

telugu-news | rtv-news | telangana | congress | rs-praveen-kumar

Advertisment
Advertisment
తాజా కథనాలు