పోలీసులు మీద కేసు పెట్టాలి.. | Rs Praveen Kumar Sensational Comments | RTV
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా చేస్తేనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవంటూ పోస్ట్ పెట్టారు.
తెలంగాణలో జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేరోజు ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు దీనికి కూడా అప్లై చేశారని తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో కీలకనేతగా ఎదుగుతున్నారు. దళితనేత, స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రవీణ్కు కేసీఆర్ అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. 2028 అధికారమే లక్ష్యంగా ప్రవీణ్ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ములాఖత్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. కవిత దగ్గర రూపాయి దొరకకపోయినా ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. వాళ్ల పేర్లు, వీళ్లా పేర్లు చెప్పాలంటూ ఈడీ అధికారులు కవితను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ తన నామినేషన్ను దాఖలు చేశారు.
మిగతా గ్యారెంటీలలాగా నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ సర్కార్ను కోరారు. రాష్ట్రంలో నేడు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గొర్రెను కానని..కాలేనని..ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన తనకు లేదన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.