Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు
కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ ప్లాట్ ఫామ్ వన్లో ఒక వ్యక్తి కాల్పులు చేశాడు. దీంట్లో ఒకరికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు దుండుగుడిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో.కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఇక్కడ హాల్డ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. మంత్రి కిషన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.
పశ్చిమబెంగాల్ లోని బర్ధమాన్ రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషనులో నిర్మించిన133 ఏళ్ల కిందటి పురాతనమైన మెటల్ వాటర్ ట్యాంకు కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేశారు.