/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయి స్పృహ కోల్పోయారు.
Also Read: Sports: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ పై మూడు నెలల నిషేధం
అంతా కుంభమేళాకు వెళ్ళేందుకే...
వీకెండ్ కావడంతో కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు రైల్వేశాఖ 2 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. అయినా కూడా రద్దీని తగ్గించలేకపోయింది. ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు జనాలు తండోపతండాలుగా బయలు దేరుతున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.
Also Read: HYD: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలీ ఏడీఈ ఆస్తులు..రూ.100కోట్లు పైనే