Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
పూణేలోని రోడ్డుపై తన పిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని కారులో వెనకాలే వస్తున్న మరో వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో పోలీసులు నిందితుడితో పాటు అతనితో ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు.
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
పూణెలోని దిగవాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ వాసులుగా గుర్తించారు.
మహారాష్ట్రలోని పుణెలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తం అయ్యింది.
పూణేలో 13 ఏళ్ల బాలికను తండ్రి, మేనమామ, కజిన్ అత్యాచారం చేసి బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది. స్కూలులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠం చెబుతుండగా.. జరిగిన విషయాన్ని టీచర్ కు చెప్పింది బాలిక. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాక్సో చట్టం కింద నిందితులను అరెస్ట్ చేశారు.
పూణె టీనేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేసును విచారిస్తున్న పోలీసులు సాసూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత బాలుడి రక్త నమూనాలను మార్చినట్టు అభియోగాలు ఇద్దరు వైద్యులపై నమోదయ్యాయి.
పూణెలోని కళ్యాణి నగర్లో లగ్జరీ పోర్షే కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కారు ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు నిందితుడి తండ్రి తెలిపాడు. దీంతో డ్రైవర్, సురేంద్ర అగర్వాల్ను పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది.
పూణెలో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి కారణమైన మైనర్ బాలుడికి కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగి వచ్చిన కోర్టు బాలుడికి మంజూరు చేసిన బెయిల్ ని రద్దు చేసింది.