/rtv/media/media_files/2025/01/13/CWpqEGHoW2OZCjrTLEAy.jpg)
HMPV Virus body Photograph: (HMPV Virus body)
Maharashtra: మహారాష్ట్ర ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు రేపుతుంది. అరుదైన న్యారోలాజికల్ డిజార్డర్ అయిన జీబీఎస్.. పుణేలో ఎక్కువ మందికి సోకుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు దీని బారిన 73 మంది పడగా.. 14 మందిని వెంటిలేటర్పై ఉంచినట్లు సమాచారం. అదృష్టవశాత్తు దీని వల్ల ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పేదు.
Also Read: Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్ చేసిన సర్కార్..మరీ ఆచారం సంగతేంటి!
కానీ వైద్యారోగ్య శాఖ మాత్రం పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు మొదలు పెట్టింది. గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డారని తెలిస్తే వెంటనే వారిని ఆస్పత్రులకు తీసుకుని పోతున్నారు. అలాగే ఈ వ్యాధి ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స ఎలా తీసుకోవాలో కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
పుణేలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతండగా.. ఆసుపత్రుల వైద్య బృందాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఈక్రమంలోనే వైద్యోరోగ్య శాఖకు ఈ విషయాలను వివరించి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈక్రమంలోనే వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేస్తూ.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.
ఇప్పటి వరకు మొత్తంగా 7 వేల 200 ఇళ్లలో ఈ సర్వేలు చేపట్టారు. అలాగే ఈ వ్యాధి సోకిన వారికి ఇచ్చే ఇంజక్షన్లు, మందుల నిల్వలను అన్ని ఆస్పత్రుల్లోనూ అంతకంతకూ ఎక్కువ మోతాదులో ఉంచుతున్నారు.
Also Read: Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
ఇప్పటి వరకు 73 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 44 మంది పుణే రూరల్కు చెందిన వాళ్లు కాగా, 11 మంది పుణే కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన వాళ్లు. అలాగే మరో 15 మంది పంప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వాళ్లు , డీఎస్కే విశ్వ నుంచి 8, నాందేడ్ నగరం నుంచి 7, ఖడక్ వాసలా నుంచి ఆరుగురు రోగులు ఉన్నారు. ఇందులో ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు ముగ్గురు ఉండగా, 6-18 ఏళ్ల వయసు వరకు ఉన్నవారు 18 మంది వరకు ఉన్నారు. ఏడుగురు రోగులు మాత్రం 60 ఏళ్లకు పైబడిన వారే అని వైద్యులు తెలిపారు.
అసలి గులియన్ బారే సిండ్రోమ్ అంటే...
గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారందరిలోనూ నరాల బలహీనత, తిమ్మిర్లు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతాయి. అయితే ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువ మంది త్వరగానే కోలుకుంటున్నారు.
దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
ముందుగా కండరాల నొప్పి మొదలవుతుంది. నడవడానికి, పనులు చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అలాగే శ్యావ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడడం, మింగడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే దృష్టి సమస్యలను కూడా ఎదుర్కుంటారు. జీబీఎస్ లక్షణలు రోజులు లేదా కొన్ని వారాల పాటు అభివృద్ధి చెందుతాయి. లక్షణాలు కనిపించిన మొదటి రెండు వారాల్లోనే చాలా మంది బలహీనతతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు. మూడో వారం నాటికి మరింత బలహీనపడుతుంటారు.
Also Read: YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాయం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల!