Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా పెట్టిందని విచారణలో తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా పెట్టిందని విచారణలో తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు మీద మరో కేసు నమోదు అయింది. కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లో ఒకరైన వేణుమాధవ్ కంప్లైంట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. నేను హిరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడిందని.. అలాంటివి చేయాల్సిన కర్మ నాకెందుకని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవ్వరిని వదలమని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్ర సాయం కోరితే సహకరిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఇంటిలిజెంట్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో జగన్ పిచ్చి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
SIB మాజీ DSP ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ కి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు కస్టడీ లోకి తీసుకోవచ్చని తెలిపింది.రేపు చంచల్ గూడ జైలు నుండి అతనిని కస్టడీలోకి తీసుకొంటామని పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు.
తెలంగాణ లో ఫోన్ ట్యాపిగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ నేత 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పీఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు.