New Update
/rtv/media/media_files/2025/06/17/htZTlrBCg19boqU6X6Of.jpg)
Phone tapping Case
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది.
ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితుల్లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, వ్యాపారులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరు జూబ్లీహిల్స్ పీఎస్కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు ప్రభాకర్రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చేవారని ఆ నలుగురు నిందితులు సిట్ అధికారులకు చెప్పారు.
పోల్ 2023 వాట్సాప్ గ్రూప్పై సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితులైన వినయ్ రెడ్డి, గాలి అనిల్ ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బు గురించి సిట్ ఆరా తీసింది. అంతేకాదు 2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది.
తాజా కథనాలు