Attack on Maha TV: మహా టీవీపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి

హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ఛానల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడ దాడులకు పాల్పడ్డారు.

New Update
Attack on Maha TV

Attack on Maha TV

Attack on Maha TV:

హైదరాబాద్‌(Hyderabad)లోని మహా న్యూస్‌ ఛానల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు(BRS Activists) అక్కడ దాడులకు పాల్పడ్డారు. మహా ఛానెల్ ఆఫీసులోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు, కార్లు ధ్వంసం చేశారు. రామన్న పైనే కామెంట్స్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Also Read: ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

ఇదిలాఉండలా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చాలా మీడియా సంస్థలు ఎన్నో కథనాలు ప్రసారం చేశాయి. మహా టీవీ కూడా కథనాలు ప్రసారం చేసింది. అయితే ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌ పేరును ప్రస్తావించడంతో బీఆర్‌ఎస్‌ వర్గాలు మండిపడ్డాయి. కేటీఆర్‌ కూడా ఇప్పటికే  ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు టీవీ ఛానెల్‌పై దాడులు చేయడాన్ని పలువురు జర్నలిస్టులు ఖండిస్తున్నారు. చట్టం ప్రకారం ఎదుర్కోవాలని.. ఇలాంటి హింసకు పాల్పడటం సమంజసం కాదని అంటున్నారు. 

Also Read: ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’

Advertisment
Advertisment
తాజా కథనాలు