India Pakistan War Latest Updates | 2 రోజుల్లో లేపేస్తాం | Indian Army Warning | Pahalgam | RTV
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని రోడ్లపై పాక్ జెండాలను అతికించి నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం ఇరు దేశాల మధ్య చోటుచేసుకుంది. పాక్తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దీనికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. కాశ్మీర్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన మరొక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టూరిస్టులు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో టెర్రరిస్టులు ఒక వ్యక్తిని అతి కిరాతంగా కాల్చేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు.
పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి తామే కారణమని లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.
పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్కు వచ్చే సింధూ నీటిని తగ్గించవద్దని కోరాడు.
పహల్గాములో జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమర్నాథ్ యాత్ర 2025 భద్రతతో సజావుగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని, ఉగ్రవాదం ఎదుర్కొనే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.