North Korea: ఉక్రెయిన్పై యుద్ధానికి ఉ.కొరియా సైనికులు
ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా సాయం చేస్తోంది. తాజాగా తమ దేశానికి చెందిన మరో 30 వేల మంది సైనికులను పంపించింది. దక్షిణ కొరియా సైన్యం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది.
ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా సాయం చేస్తోంది. తాజాగా తమ దేశానికి చెందిన మరో 30 వేల మంది సైనికులను పంపించింది. దక్షిణ కొరియా సైన్యం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది.
అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్ అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి.
సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దేశంలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా'ను ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నాయని, నార్త్ కొరియా వైపు సానుభూతిని చూపిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై దక్షిణ కొరియా దాడి చేస్తే అణ్వాయుధాలతో విధ్వంసం సృష్టిస్తామని ఆ దేశ అధ్యక్షుడిని హెచ్చరించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.
ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్నింటిని మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం.