Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు
AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.