PV Statue: పీవీకి అరుదైన గౌరవం

మాజీ ప్రధానమంత్రి, తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహాం ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది.

New Update
P. V. Narasimha Rao

P. V. Narasimha Rao

మాజీ ప్రధానమంత్రి, తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహాం ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విగ్రహ ఏర్పాటు చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కమిషన్‌ సూచించింది.కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ భవన్‌ లో పీవీ విగ్రహం  ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ప్రతిపాదించింది. కాగా ఎన్డీఎంసీ చేసిన ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది.  

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

A Rare Honor For PV

రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజించి రెండు రాష్ర్టాలకు కేటాయించారు. దీంతో  ప్రస్తుతం తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్‌తో కలిసి ఉంది. దానివల్ల అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. అయితే ఢిల్లీలో తెలంగాణ కోసం నూతన భవనం నిర్మించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర భవన్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. దాని పక్కనే పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ని  పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ గతంలోనే కొరింది. ఈ ప్రతిపాదనను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ముందుంచడంతో  కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయన విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే నూతన తెలంగాణ భవన్‌ నిర్మాణం అనంతరం విగ్రహాన్ని అక్కడికి తరలిస్తారని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు మాత్రమే. అయితే ఆయన మరణానంతరం ఆయనను కాంగ్రెస్‌ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కూడా పెట్టనివ్వకుండా ఆ పార్టీ నాయకులు అవమానించారు. అంతేకాక దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారందరి సమాధులు ఢిల్లీలో ఉండగా పీవీ అంత్యక్రియలు కూడా ఢిల్లీలో చేయనివ్వకుండా అవమానించింది.  దీంతో ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఢిల్లీలో పీవీ స్మారకం ఏర్పాటుతో పాటు ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. ప్రస్తుతం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఎన్డీఏనే కారణం కావడం విశేషం. కాగా పీవీ విగ్రహ ఏర్పాటు సమయంలో ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Also Read :  హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!

bharatha ratna | ex-prime-minister | pm modi | NDA Govt | nda | telangana bhavan news | delhi-telangana-bhavan | pv-narasimha-rao

Advertisment
Advertisment
తాజా కథనాలు