National Defence Academy: ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం.. NDAలో నారీశక్తి నిరూపించిన 17 మంది అమ్మాయిలు

మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్‌ బ్యాచ్ పాస్‌అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.

author-image
By K Mohan
New Update
National Defence Academy

ఇండియాలో నారీ శక్తి ఏ మాత్రం తక్కువ కాదని మరోసారి నిరూపితమైంది. ఉగ్రవాదులపై జరిగిన ఆపరేషన్ సిందూర్‌ గురించి మీడియాకు వివరించి ఇండియన్ ఆర్మీలో మహిళలు ఏ స్తాయిలో ఉన్నారో అని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు మహారాష్ట్ర పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్‌ బ్యాచ్ పట్టభద్రులయ్యారు. వారి పాస్‌అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. అందులో 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ 17మంది ఉమెన్ ఆఫీసర్లు త్రివిధ దళాల్లో అధికారులుగా సేవలందించనున్నారు.

మిజోరాం గవర్నర్, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ విజయ్ కుమార్ సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరైయ్యారు. దేశ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన, చారిత్రాత్మకమై మైలురాయి పాస్‌అవుట్‌ పరేడ్‌ అని ఆయన అన్నారు. తొలి బ్యాచ్‌కు చెందిన 17 మంది మహిళా క్యాడెట్ల విజయాన్ని ప్రశంసించారు. 2021లో మహిళా అభ్యర్థులకు డిఫెన్స్ అకాడమీ‌లో చేరడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో 2022లో మహిళా క్యాడెట్‌ల మొదటి బ్యాచ్‌ ఎన్డీయే 148వ కోర్సులో చేరారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.

nda | women | National Defense Academy | Passing Out Parade | maharashtra | pune | Indian Army | latest-telugu-news
 

Advertisment
Advertisment
తాజా కథనాలు