🔴LIVE : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ | Allu Arjun Going To Nampally Court For Regular Bail | RTV
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.
అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా రాదా అని అందరూ తెగ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఇరు వర్గాల వాదనలు పూర్తవడంతో ఈరోజు నాంపల్లి కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వనుంది. బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా..ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్కు నాంపల్లికోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ అల్లుఅర్జున్ వర్చువల్గా హాజరయ్యాడు.
TG: సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు రేవంత్పై వేసిన పిటిషన్ ను వచ్చే నెల 11న విచారిస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.
నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.
TG: మాజీ మంత్రి కేటీఆర్కు మరో షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్పై వ్యాపారవేత్త సూదిని సృజన్రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్ కోర్టుకెక్కారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణను ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.