/rtv/media/media_files/2025/07/10/uttam-namplly-court-2025-07-10-10-29-40.jpg)
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
— s5news (@s5newsoffical) July 10, 2025
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలు నిర్వహించారు.
దీనితో ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కారణంగా… pic.twitter.com/6evJbKaW1D
వారెంట్ జారీ
అయితే ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను జులై 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.