Nalgonda Court: జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు..నిందితుడికి 51 ఏళ్ల శిక్ష..
ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై 2021లో తిప్పర్తి పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.