/rtv/media/media_files/2025/02/28/M4OovwCYOn58oZJDSgvp.jpg)
Adilabad minor girl
TG Crime : మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నాపిల్లలు మొదలు ముసలివారి వరకు ఆడవారు కనపడితే చాలు వారిని లైంగిక దృష్టితోనే చూస్తున్నారు. అవకాశం వస్తే అత్యాచారం చేయడం, సహకరించకపోతే కాటికి పంపడం సర్వసాధారణమైంది.
Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం
అయితే చిన్నారులపై అఘాయిత్యాల పట్ల షీ టీం వారిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అలా చేసిన ఒక ప్రయత్నంలో ఒక చిన్నారి లైంగికదాడికి గురైన విషయం వెలుగు చూసింది.ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. అభంశభం తెలియని ఓ పదేళ్ల చిన్నారికి డబ్బు, చాక్లెట్లు ఆశచూపి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న షీటీం నిందితుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి పంపించింది.
ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?
షీం వెల్లడించిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులు, మహిళలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో షీటీం బృందాలు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా బంగారిగూడలోని ఓ స్కూల్లో షీ టీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆ బృందం చెప్పిన విషయాలను గ్రహించిన ఓ విద్యార్థిని తనతో ఓ యువకుడు ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకొని షీ టీం బృందానికి తెలియజేసింది. వెంటనే దీనిపై స్పందించిన షీ టీం బృందం విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.జాదవ్ కృష్ణ ప్రతిరోజు రూ.10 ఇస్తూ చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తూ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. ఈ విషయం షీ టీం అవగాహనతో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్లో పెడితేనే.. అమెరికాకు వీసాలు