కాళేశ్వరంపై విచారణ.. ఇంజనీర్ల సమాధానాలకు కంగుతిన్న పీసీ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కంగుతిన్నది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు 'తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా'నంటూ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి చెప్పడంతో షాక్ అయ్యారు.