మెదక్ లో హైడ్రా కూల్చివేత | Hydra demolition in Medak | RTV
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు బోధించారు. నిన్న చేగుంట మండలం వడియారం స్కూల్ పరిశీలనకు కలెక్టర్ వెళ్లారు. టెన్త్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి పరీక్షించారు. అనంతరం వారికి స్వయంగా పాఠాలు బోధించి సందేహాలు నివృత్తి చేశారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న గోపాల్ అనే వ్యక్తి.. అడ్డుగా ఉన్నాడని అన్ననే చంపేశాడు. మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి అతి కృరంగా కడతేర్చాడు.
తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళ బలైంది. మెదక్ జిల్లా రామంతాపూర్లో అంబేద్కర్ విగ్రహం అరుగుపై మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను భరోసా సెంటర్కు తరలించారు.
కొండపోచమ్మ సాగర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు నీటిలో దిగిన 7గురు యువకుల్లో ఐదుగురు అందులోనే మునిగి చనిపోయారు. మరో ఇద్దరు తృటిలో బయటపడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్ ప్రవీణ్, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు.
భర్త ఇంట్లో ఉండగానే వీడియో కాల్ మాట్లాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాటలు వినిపించకపోయే సరికి భర్త గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించింది.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.