Manchu Vishnu Bouncers Attack | సార్ అంటే కొట్టారు | Manchu Manoj Issue | Mohan Babu House | RTV
మనోజ్ ఈరోజు తండ్రి మోహన్ బాబు నివాసం ముందు నిరసనకు దిగడం చర్చనీయంశమైంది. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కత్తులు, గన్స్ తో రౌడీలు మమల్ని కొట్టడానికి వచ్చారని తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మరోసారి తలపడనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ గొడవలతో రచ్చలేపిన వీరు.. ఇప్పుడు ఒకరి సినిమాతో మరొకరు పోటీ పడనున్నారు. విష్ణు ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అదే రోజున మనోజ్ భైరవం మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం.
పోలీసులతో రాత్రి జరిగిన ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు.. తాను చట్టానికి లోబడే సహకరించాను అని వీడియో రిలీజ్ చేసారు. అయితే పోలీసులు వచ్చి నాపై దురుసుగా వ్యవహరించారని మంచు మనోజ్ ఆరోపించారు.
మంచు మనోజ్ను భాకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరావుపేట పీఎస్ వద్ద మనోజ్ అర్ధరాత్రి హల్ చల్ చేశారు. ఓ స్థానిక ఓ రిసార్ట్లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు.
మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప..ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా..నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.