Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!
‘కాంతార చాప్టర్ 1’ టీమ్ త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివారం సాయంత్రం 30 మంది ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషభ్ కూడా అందులోనే ఉన్నారు. వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎవరికీ ఏం కాలేదు.