ISRO: నేల మీదకు జాబిల్లి..చంద్రయాన్ 4,5 లక్ష్యం
చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ 4, 5 మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా భూమి మీదకు జాబిల్లిని తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. 2028లో వీటిని ప్రయోగించనున్నారు.