/rtv/media/media_files/2025/05/15/wv55KOxfpChvMyqCqomt.jpg)
IND-PAK WAR Jaishankar strong counter to Trump
IND-PAK WAR: నీ జోక్యం అవసరం లేదు.. ట్రంప్ కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్!భారత్-పాక్ వార్ అంశంలో ట్రంప్కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండో -పాక్ చర్చల్లో మూడో వారి జోక్యం అవసరం లేదన్నారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాదు టెర్రర్ క్యాంప్స్ను మూసివేయాలని వార్నింగ్ ఇచ్చారు. సింధూ జలాల నుంచి చుక్క నీరు పాక్కు ఇవ్వమని, కాల్పుల విరమణ పాకిస్తానే కోరుకుంటుంది తప్పా భారత్ కాదని చెప్పారు.
Also Read : వైరల్ కోసం యువకుడి పిచ్చివేషాలు.. కాలుకున్న చెప్పు తీసి కండక్టర్తో!
#WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd
— ANI (@ANI) May 15, 2025
Also Read : 'ప్యారడైస్' రికార్డ్స్ హంట్ షురూ.. భారీ ధరకు అమ్ముడైన ఆడియో రైట్స్!
మేము సిద్ధంగా ఉన్నాం..
'పాకిస్తాన్తో మా సంబంధాలు, వ్యవహారాలు పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయి. అది సంవత్సరాలుగా జాతీయ ఏకాభిప్రాయం. దానిలో ఎటువంటి మార్పు లేదు. పాకిస్తాన్తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులను అప్పగించాల్సిన జాబితా పాకిస్తాన్ దగ్గర ఉంది. వారు ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను మూసివేయాలి. ఉగ్రవాదం గురించి ఏమి చేయాలో వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవి సాధ్యమయ్యే చర్చలే' అని ఎస్ జైశంకర్ చెప్పారు.
Also Read : పక్కింటి యువకుడితో భార్య రాసలీలలు.. అడ్డొచ్చిన భర్తను లేపేసిన ప్రియుడి ఫ్రెండ్!
#WATCH | On cessation of firing & military action between India and Pakistan, EAM Dr S Jaishankar says,"...It is clear who wanted cessation of firing."
— ANI (@ANI) May 15, 2025
"We achieved the goals which we set out to do by destroying the terrorist infrastructure. Since key goals were achieved, I… pic.twitter.com/4IiAAY72Iz
ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా మేము నిర్దేశించిన లక్ష్యాలను సాధించామని అన్నారు. కీలక లక్ష్యాలు సాధించాం. ఆపరేషన్ ప్రారంభంలో కూడా మేము ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేస్తున్నామని, సైనికులపై కాదని స్పష్టం చేశాం. సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలని పాకిస్తాన్కు సందేశం పంపించాం. వారు మా మంచి సలహా తీసుకోకూడదని భావించారంటూ మండిపడ్డారు.
Also Read : వామ్మో.. మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా కేసులు, మరణాలు!
ind pak war | telugu-news | today telugu news