ACB raids : ఏసీబీ వలలో చిలకలూరిపేట ఎంఈవో
పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండల ఎంఈవో లక్ష్మి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాసరావు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఎంఈవోను సంప్రదించాడు.