/rtv/media/media_files/2025/04/28/XBP59sUa30m1FtTb1dKs.jpg)
Chandrababu Vs Jagan
విశాఖ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు.. కుప్పం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగుర వేసింది. విశాఖ, గుంటూరు కార్పొరేషన్ల మేయర్ ఎన్నికను నేడు అధికారులు నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూటమి నుంచి బరిలోకి దిగిన టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గతంలో గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గా ఉండగా.. ఆమెపై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మూడింట రెండు వంతుల సభ్యులు మద్దతు తెలపడంతో వెంకట కుమారి పదవి కోల్పోయారు. దీంతో ఈరోజు నూతన మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించగా కూటమి నుంచి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. దీంతో విశాఖలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.
గ్రేటర్ విశాఖ మేయర్గాటీడీపీ 96 వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక. విశాఖ కార్పొరేషన్ 7వ మేయర్ గా పీలాకు సర్టిఫికెట్ అందించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మయూర అశోక్.#AndhraPradesh #visakhapatnam #Vizag #VizagNews #TeluguNews pic.twitter.com/TimPulR4ff
— Vizag News Man (@VizagNewsman) April 28, 2025
గుంటూరు మేయర్ గా రవీంద్ర..
గుంటూరులోనూ మేయర్ పీఠం కూటమికే దక్కింది. మేయర్ బరిలో టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి నిలిచారు. రవీంద్రకు 34 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా.. వైసీపీ అభ్యర్థికి 27 మంది మద్దతు లభించింది. దీంతో రవీంద్ర ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
గుంటూరు నూతన మేయర్ గా TDP కోవెలమూడి రవీంద్ర.
— Sai kumar (@devo_pspk) April 28, 2025
కూటమి అభ్యర్థి గా గెలుపొందిన కోవెలమూడి రవీంద్ర.
కోవెలమూడి రవీంద్ర కు 34 ఓట్లు
అచ్చాల వెంకట రెడ్డి కు 27 ఓట్లు. pic.twitter.com/y6ofnURmHt
కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. మొత్తం 24 మంది సభ్యులకు గానూ.. 14మంది కౌన్సిలర్లు టీడీపీ వైపు నిలిచారు. వీరితో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ కూడా మద్దతు ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
కుప్పo మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. లో. 6 వార్డ్ కౌన్సిలర్. సెల్వ రాజ్ చైర్మన్ గా ఎన్నిక.
— @RKR (@krishnadevaansh) April 28, 2025
టీడీపీ ఖాతాలో కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి...
వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరుకున్న 4 కౌన్సిలర్లు
24 మంది సభ్యులలో 14 మంది టీడీపీ మద్దతు తెలిపిన కౌన్సిలర్లు.... ఒక్క ఎక్స్ ఆఫిషియోనే మద్దత pic.twitter.com/nwilAdhJrL
(telugu-news | latest-telugu-news | guntur | kuppam)