Gujarat: గుజరాత్ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు.
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు.
గుజరాత్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
9 నెలల కిత్రం ఇంట్లో నుంచి ఓ గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య..ఆమె పై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి మళ్లీ తిరిగి వచ్చింది. అయితే ఆ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోనికి రానివ్వకపోవడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.
గుజరాత్లో చాందీపుర వైరస్ బారినపడి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గుజరాత్లోని భరూచ్లో కేవలం 10 ఖాళీల కోసం కెమికల్ సంస్థ థర్మాక్స్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీనికి వందలాది మంది యువకులు హాజరుకావడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.