/rtv/media/media_files/2025/04/26/XUkVoN7x8TYM1T85qLMb.jpg)
Gujarat news
Gujarat: గుజరాత్ లోని అంబాజీ చోటుచేసుకున్న ఒక మానవీయ సంఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రవీణ్ సింగ్ రాణా అనే మామగారు తన కోడలికి మరోసారి జీవితాన్ని అందించిన ఉదంతం ఇది. కుమారుడి మరణంతో విధవరాలిగా మిగిలిన కోడలిని కొత్త జీవితానికి పంపించి అందరికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్ సింగ్ రాణా తన కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాడు. అయితే పెళ్లి అయిన కొద్ది కాలానికే దంపతులకు ఓ చిన్నారి పుట్టింది. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయిన ఏడాదికే ప్రవీణ్ సింగ్ కుమారుడు అనూహ్యంగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. నెలల చిన్నారితో అతని భార్య విధవరాలిగా అత్తింట మిగిలిపోయింది.
తండ్రిలా ఆలోచించి..
కోడలిని అత్తింట్లో ఉంచుకున్న ప్రవీణ్ సింగ్ ఆమె బాధను గమనించాడు. మూడో వ్యక్తిలా కాకుండా నిజమైన తండ్రిలా ఆలోచించి ఆమె భవిష్యత్తును గౌరవించే నిర్ణయం తీసుకున్నాడు. కోడలికు రెండో పెళ్లి చేయాలని సంకల్పించాడు. ఆ ఊరిలోనే తన కుమారుడి స్నేహితుడిని చూసి, అతనితో కోడలికి పెళ్లి జరిపించాడు. ప్రతి మామగారు ఇలాగే ఆలోచిస్తే ఎందరో మహిళలకు కొత్త జీవితం లభించేదని స్థానికులు, కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి
ప్రవీణ్ సింగ్ తన కోడలిని తండ్రిలాగా కొత్త జీవితానికి సాగనంపాడు. తన మనవరాలికి ఓ తండ్రిని, తన కోడలికి ఓ జీవిత భాగస్వామిని కల్పించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ప్రవీణ్ సింగ్ చేసిన పనికి ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్డ్రింక్లో పురుగులమందు కలిపి
( viral | marriage)