/rtv/media/media_files/2025/05/08/jkR5iAmfgTZSv5XTKrkd.jpg)
AP Kadapa road accident Three people died
Accident: ఏపీ కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.మృతులు వేంపల్లి శ్రీరామ్ నగర్ గుట్టకు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మల్లికార్జున, మదనపల్లికి చెందిన మల్లికార్జున గా గుర్తించారు. ఘటనా గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి కేసు నమోదు చేశారు. ఈ ఊహించని ప్రమాదంతో ముగ్గురి మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన
కారు టైర్ మారుస్తుండగా..
ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సాయం చేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఓ కారు టైర్ మారుస్తుండగా.. మరో కారు ఢీకొట్టి చంపింది. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ కారు హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుంది. అయితే కారు హిమాయత్ సాగర్ Exit 17 వద్దకు రాగానే సడన్ గా బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్ వెంటనే కారు రికవరీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో స్పాట్ కి చేరుకున్న రికవరీ సిబ్బంది శివకేశవ రోడ్డుపైనే బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ ని మార్చడం మొదలు పెట్టాడు. ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది.
Also Read : ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!
raod-accident | kadapa | died | today telugu news