కొండచరియలు విరిగిపడి.. ముగ్గురు మృతి!
భారీ వర్షాలకు సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు.
భారీ వర్షాలకు సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు.
24 గంటల పాటు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించడానికి దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్కి చెందిన సుబ్రతా ఘోష్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన కాసేపటికే చనిపోయాడు. తన గైడ్ చంపల తమంగ్తో కలిసి సుబ్రతా ఘోష్ శిఖరాన్ని అధిరోహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.
పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్ ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం.
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ద విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. వీరిలో లోకో పైలట్ కూడా ఉన్నారు. మరో ఐదురుగు రైల్వే సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
మేతకు వెళ్లిన 65 మూగజీవాలు మృతి చెందిన ఘటన అన్నమయ్యలో జరిగింది. శ్రీరాములు అనే వ్యక్తి మేత కోసం గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి మేతకు తీసుకెళ్లాడు. కొండ వెనుక నుంచి ఎవరో నిప్పు పెట్టడంతో ఆ మూగజీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.