BIG BREAKING: పాకిస్తాన్‌లో చెలరేగిన అల్లర్లు.. 12 మంది దారుణ హత్య

పాకిస్తాన్‌లోని లాహోర్‌తో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు, తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో అల్లర్లు చెలరేగి.. 12 మంది నిరసనకారులు మృతి చెందారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

పాకిస్తాన్‌లోని లాహోర్‌తో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు, తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో అల్లర్లు చెలరేగి.. 12 మంది నిరసనకారులు మృతి చెందారు. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు భావించి, దానిని నిరసిస్తూ TLP మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫ్లకార్టులతో నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీ చార్జితో ప్రజలను అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఘర్షణలు చెలరేగాయి. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు