USA: హష్ మనీ కేసులో ట్రంప్కు ఎదురుదెబ్బ
హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్కు ఊరట లభించలేదు. న్యూయార్క్ జడ్జి విధించే శిక్షను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ట్రంప్కు శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది.
హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్కు ఊరట లభించలేదు. న్యూయార్క్ జడ్జి విధించే శిక్షను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ట్రంప్కు శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు సంజయ్పై కేసు నమోదు చేశారు.
బాలింతరాలిగా ఉన్న భార్యను ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు భర్త పై గృహ హింస కేసు పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని కోర్టు ఆమెని మందలించింది.
మేడిగడ్డ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత నెల 26న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు.
తమ అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు అంటూ సుగాలీ ప్రీతి తల్లి పార్వతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినతి పత్రం ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున తన షోలో అసభ్యపదజాలం ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేష్, పవన్ ఖేరాలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా ఉండేందుకే రజత్ శర్మ ఈ కేసును వేసినట్టు తెలుస్తోంది.