Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు!
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
థాయ్లాండ్లో 49 మందితో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
గోరఖ్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మరణించగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్లీపర్ బస్సులో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం అటూ ఇటూ తిరిగే గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు వాహనాలను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.