Building collapse : ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!
ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది.
ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది.
యూపీలోని మధురలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం సడక్ ప్రాంతంలోని గోవింద్ నగర్లో ఒక గుట్టపై నిర్మించిన అనేక అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తోటారామ్ (38), యశోద (6), కావ్య (3) మరణించారు. అనేక మందిని శిథిలాల కింద నుంచి తీస్తున్నారు.
ఢిల్లీలోని ముస్తఫాబాద్లో బిల్డింగ్ కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో భవన యజమాని తెహసీన్(60)తో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ఉన్నారు.
ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా పదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది. ఇందులో అక్కడ పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
TG: సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ (మం) మల్కాపూర్లో భారీ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమంగా నిర్మించారని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. రంగంలోకి దిగిన ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు బాంబులు పెట్టి ఆ భవనాన్ని నేలమట్టం చేశారు.
ఢిల్లీలో కరోల్బాగ్లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం ఉదయం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.ఇప్పటి వరకు 12 మందిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి.
గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.