Delhi Building Collapse: కుప్పకూలిన 20 ఏళ్లనాటి భవనం.. ఇంటి యజమానితో సహా 11 మంది మృతి
ఢిల్లీలోని ముస్తఫాబాద్లో బిల్డింగ్ కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో భవన యజమాని తెహసీన్(60)తో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ఉన్నారు.